నారాయణపేట, డిసెంబర్ 3 : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అ న్నారు. జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన 8వ ఎడిషన్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివారం బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ యన మాట్లాడుతూ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో జిల్లా కు పేరు తీసుకువచ్చేలా క్రీడాకారులు రాణించాలన్నారు.
క్రీడల్లో రాణించిన వారికి క్రీడాకోటాలో రిజర్వేషన్ నుంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పోటీల్లో వై దిక పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి, ధన్వాడ మెడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందగా ఎ మ్మెల్యే నుంచి విజేతలు బహుమతులను అందుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ జగదీశ్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఎంపీ పీ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.