వానకాలం వచ్చిందంటే మారెడ్డిపల్లి వాగు వంతెన మీద ప్రయాణికులు నరకయాతన పడేవారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వంతెనను దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుతూ కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయిన సందర్భాలున్నాయి. ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రూ.9.25కోట్లతో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించగా పనులు వేగంగా నడుస్తున్నాయి.
మదనాపురం, జూలై 10: మదనాపురం-ఆత్మకూరు ప్రధాన రహదారిపై రైల్వేగేటు సమీపంలో మారెడ్డిపల్లి వాగు ప్రవహిస్తుంది. సరళాసాగర్, శంకర సముద్రం నీటితో నిండిన తరువాత గేట్లు ఎత్తివేస్తే దిగువన ఉన్న మారెడ్డిపల్లి మీదుగా రామన్పాడు డ్యాంకు వరద చేరుతుంది. వాగు పైన బ్రిడ్జి చిన్నగా ఉండ డం, ఒకేసారి వరద ఉధృతంగా ప్రవహించడంతో అటుగా రాకపోకలు బంద్ అయ్యేవి. వాగుకు అటువైపు ఉన్న ఆత్మకూరు, అమరచింత గ్రామాల ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం జిల్లాకేంద్రానికి రావాలంటే దాదా పు 10 కిలోమీటర్ల మేర తిరుగుతూ రామన్పాడు డ్యాం మీదుగా మదనాపురానికి చేరుకొని అక్కడి నుంచి వనపర్తి, హైదరాబాద్, కర్నూలు నగరాలకు వెళ్తారు.
ఎమ్మెల్యే ఆల చొరవతోనే..
మారెడ్డిపల్లి వాగు వద్ద బ్రిడ్జి నిర్మిస్తే ప్రజల కష్టాలు తీరుతాయని భావించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఎంత వరద వచ్చినా తట్టుకునేలా అధునాతన బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. గతంలో టెండర్ ద క్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపి వేశారు. వానకాలం సమీపిస్తున్నందున మరోమారు వాగులో ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో రీ టెండర్ చేసి రూ.9.25కోట్లతో ఎ మ్మెల్యే బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు యాభైశాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిపై వరద ప్రవహిస్తే వాహనదారులు కొట్టుకు పోకుండా బ్రిడ్జికి ఇరువైపులా 5ఫీట్ల మేర ఇనుప కడ్డీలతో కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఎలాం టి ప్రాణనష్టం జరిగే అవకాశాలు లేవు.
మూడు దశాబ్దాల కల ..
మారెడ్డిపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మించాలనేది ఆ చుట్టుపక్కల ప్రజల మూడు దశాబ్దాల కల. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురిసి ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి బ్రిడ్జిపై ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో స్థా నిక పోలీసులు వెళ్లొద్దని చెబుతున్నా బైక్పై ముగ్గురు వెళ్లి వాగు దాటుతూ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందారు. అలాం టి ఘటనలు పునరావృతం కాకుండా వంతెనను వేగవంతంగా పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులతో ఎమ్మెల్యే సమీక్షిస్తూ వివరాలను తెలుసుకుంటున్నారు. నా ణ్యత విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు.
బ్రిడ్జి నిర్మిస్తే కష్టాలు ఉండవు..
వానకాలంలో మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గతంలో నలుగురు చనిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాం. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సహాయంతోపాటు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి అన్ని విధాలా ఆదుకున్నాం. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికుల కష్టాలు తీరుతాయని గతంలో ఓ కాంట్రాక్టర్కు పను లు అప్పగించాం. అతడు మధ్యలోనే పను లు వదిలేసి వెళ్లాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రీ టెండర్ వేయించి, అధునాతనంగా ఎంత ఉధృతి వచ్చినా తట్టుకునేలా బ్రిడ్జినిర్మాణ పనులను చేయిస్తున్నాం. ఈ వానకాలంలో బ్రిడ్జిపై మరో ప్రాణం పోవద్దనే సదుద్దేశంతో, ప్రస్తుతమున్న బ్రిడ్జిపై రెండువైపులా ఇనుప కడ్డీలతో పకడ్బందీగా కంచె ఏర్పాటు చేశాం. త్వరలోనే పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ప్రత్యే క చొరవతోనే నియోజకవర్గంలో 21 చెక్డ్యాంలు నిర్మించుకున్నాం.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే