మహబూబ్నగర్, జనవరి 6 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ వెంకట్రావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ పునరావాస కేంద్రాల పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే కోయిల్సాగర్ ప్రా జెక్టు గ్రావిటీ కెనాల్కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. గతంలో ఇచ్చిన అవార్డు చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం దేవరకద్ర నియోజకవర్గంలో చేపట్టిన డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. భూత్పూర్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను 15 రోజుల్లోగా ఒక కొలిక్కి తీసుకురావాలని కలెక్టర్ వెంకట్రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరావు, ట్రాన్స్కో ఎస్ఈ మూర్తి, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్ తదితరులు ఉన్నారు.
దేవరకద్ర రూరల్, జనవరి 6 : విద్యావేత్త, క్రీడాభిమాని, అవయవాలు దానంచేసి 8మందికి ప్రాణం పోసిన ప్రధానోపాధ్యాయుడు నాగేందర్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కౌకుంట్లలో నాగేందర్ స్మారక జిల్లాస్థాయి మెగా క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ముందుగా నాగేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం తోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన నాగేందర్ మృతి తీరని లోటన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, దేవరకద్ర జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ స్వప్నాకిషన్రావు, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిష్ట న్న, సామాజికవేత్త అబ్దుల్ జహంగీర్పాషా పాల్గొన్నారు.