మహబూబ్నగర్, జనవరి 24 : దేశంలో పూర్వకాలం నుంచి ఆడపిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో ని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల్ని చదువుకోనిద్దాం అన్నారు. ఆడపిల్లలు సమాజంలో మగవారితో సమానంగా చూడవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని విషయాల్లో మగవారి కన్నా ఆడవారు బాగా పని చేస్తారన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆడపిల్లలు చదువుకోవాలని గురుకుల పాఠశాలలతోపాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి జరీనా తదితరులు పాల్గొన్నారు.
డీడబ్ల్యూవో కార్యాలయంలో…
జిల్లాకేంద్రంలోని డీడబ్ల్యూవో కార్యాలయంలో జాతీ య బాలికల దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బాలసదానంలోని బాలికలకు స్వీట్లను కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు అందజేశారు. బాలికలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, హక్కుల ను కాపాడాలని సంబంధింత అధికారులు సూచించారు. కార్యక్రమంలో సంబంధింత అధికారులు ఉన్నారు.
ఆడపిల్ల చదువు అవనికే వెలుగు
ఆడపిల్ల చదువు..అవనికే వె లుగు అని ఐసీడీఎస్ సూపర్ వైజర్లు సునీత, శంకరమ్మ అ న్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ బాలికా దినోత్సవం భాగంగా సోమవా రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ఆడపిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూ చించారు. బాల్యవివాహాలను అడ్డుకోవాలన్నారు. మహిళలు చేతులపై గోరింటాకుతో వేయించుకొని ప్రదర్శించారు. కా ర్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
‘బాలిక రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత’
బాలిక రక్షణ, పరిరక్షణ ప్రతిఒక్క రి బాధ్యత అని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కు లు, ఆరోగ్యం, విద్య, సామాజిక, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు, మహిళలు ప్రతిఒక్కరూ త మ హక్కలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సీడీపీవో రమణ, నాయకులు వెంకట్రెడ్డి, మల్లయ్య, టీచర్లు ఎమ్యెల్య, నర్మధ, బాలికలు తదితరలు పాల్గొన్నారు.
బాలికలకు ముగ్గుల పోటీలు
మండలంలోని చెన్నవెల్లి గ్రా మంలో సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ వే డుకలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పో టీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ రాధ, అంగన్వాడీ టీచర్ సు మతి తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కల్పించాలి
చట్టాలపై అవగాహన కల్పించాలని, బాలికల సంరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ రాజరాజేశ్వరి అన్నా రు. మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవా రం బాలికల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. అం గన్వాడీ టీచర్లు గ్రామాల్లో బాలికల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం పథకాలపై అవగాహన కల్పించాలని సూపర్వైజర్ కోరారు. చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ, వీవో జయమ్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఆడపిల్లలు ఇంటికి అందం
ఆడపిలలు ఇంటికి అం దం, మహాలక్ష్మి స్వరూపమని ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి అన్నా రు. చిన్న చింతకుంట మండలకేంద్రంలో సోమవారం జా తీయ బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. అధికారులతో కలిసి కేక్కట్ చేసి బాలికలకు తినిపించా రు. ఆడపిల్లలను పుట్టనిద్దాం బతకనిద్దామని, ఆడపిల్లనే దే శానికి గర్వకారణమన్నాని ఎంపీపీ అన్నారు. కార్యక్రమం లో తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.