నవాబ్పేట, ఏప్రిల్ 10 : మండలంలోని చౌటపల్లి గ్రామంలో అధికారులు, సిబ్బంది నీటి సమస్యను పరిష్కరించారు. గత మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం డీఎల్పీవో పండరీనాథ్ ఆధ్వర్యంలో అధికారులు చౌటపల్లికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. నీటి సమ స్య రావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లింగంపల్లి వద్ద మిషన్భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతోనే నీటి సరఫరా ని లిచిపోయిందని వారు అధికారుల దృష్టికి తీ సుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శి కల్పన, మి షన్ భగీరథ సిబ్బంది స్పందించి పైప్లైన్కు మరమ్మతులు చేసి నీటి సరఫరాను ప్రారంభించారు. మరమ్మతు పనులు పరిశీలించిన వారిలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భ ద్రునాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షమాయుల్లాఖాన్, వాటిర్ గ్రిడ్ అధికారులు ఉన్నారు.