మహబూబ్నగర్ : రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఆయన విగ్రహానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. నిజాం కొలువులో ఉంటూ వెంకటరామిరెడ్డి విద్యాభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.