జడ్చర్లటౌన్, మార్చి 26 : మన సంస్కృతీసం ప్రదాయాలను పరిరక్షించాలని సామాజిక మానవ శాస్త్రవేత్త, ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ అన్నారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ క ళాశాలలో మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో సాహిత్యం, సంస్కృతి అనే అం శంపై అంతర్జాతీయ వర్క్షాప్ను నిర్వహించారు. కళాశాల ప్రినిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రముఖ జానపద ఆ దివాసీ పరిశోధకులు ఆచార్య జయదీర్ తిరుమలరావు, ఆచార్య గూడూరు మనోజ్తోపాటు ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నలభై ఏండ్ల తెలుగు సాహి త్యం, సంస్కృతులు, పరిశీలన, అధ్యయనంపై వివరించారు. అదేవిధంగా వివిధ ప్రదేశాల నుంచి తాళపత్రాలు, సంగీత వాయిద్యాలను సేకరించి మ్యూజి యం ఏర్పాటుకు చేసిన కృషిని పరిశోధకులు జయదీర్ తిరుమల్రావు వివరించారు. అలాగే ఆచార్య గూడూరు మనోజ్ పునాది, ఆధారాలు, వర్తమా నం, భవిష్యత్ అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్ర దానం చేశారు. కార్యక్రమంలో వివిధ భాషా విభాగాల అధిపతులు డాక్టర్ కల్యాణి, సుభాషిణి, రమాదేవి, సంధ్యారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.