ధరూరు, డిసెంబర్ 5 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 3,482 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,468 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 673 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 544క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.126 టీఎంసీలు కాగా 4.419 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఆర్డీఎస్కు స్థిరంగా వరద..
అయిజ, డిసెంబర్ 5 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 2,357 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,900 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 457 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.4 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. తుమ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
టీబీ డ్యాంకు..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 680 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 1,958 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 13.126 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1592.37 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.