నారాయణపేట, డిసెంబర్ 1: నూతన ఎస్పీ కార్యాలయ భవన సముదాయాలతోపాటు పేట, ధన్వాడ మండలాల్లో రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం గురువారం పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీ, అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దామోదర్తో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు. ఎస్పీ కార్యాలయ భవనాల సముదాయం కోసం వల్లంపల్లి శివారులోని సర్వే నంబర్ 48లో 15ఎకరాల స్థలాన్ని, రూరల్ పోలీస్ స్టేషన్ కోసం జాజాపూర్ శివారులోని సర్వే నెంబర్ 197లో మూడు ఎకరాల స్థలాన్ని, ధన్వాడ మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఎకరా స్థలాన్ని పరిశీలించారు.
తాసిల్దార్ దానయ్య, సర్వేయర్ మల్లేశ్లతో కలిసి రూట్ మ్యాప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణాల కోసం త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. శంకుసాప్థనల అనంతరం త్వరగా భవన నిర్మాణాలు చేపట్టాలని హౌసింగ్ బోర్డు అధికారులను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, హౌసింగ్బోర్డు అధికారులు సీఈ విజయ్కుమార్, ఎస్ఈ తులసీధర్, ఈఈ అబ్దుల్ కుద్దూస్ హుస్సేనీ, డీఈ బాలాజీదాస్, సీఐలు శ్రీకాంత్రెడ్డి, సీతయ్య, తాసిల్దార్ దానయ్య, సర్వేయర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, డిసెంబర్ 1: ధన్వాడ మండల కేంద్రంలో నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవనం కోసం గురువారం రాష్ట్ర పోలీస్శాఖ అదనపు డీ జీ సంజయ్కుమార్ జైన్ పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ దవాఖాన మిగులు స్థలంలో పోలీస్ గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డితో కలిసి అదనపు డీజీ సంజయ్కుమార్ జైన్ స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 3 కోట్లు, తాసిల్దార్ భవన నిర్మాణనికి రూ.1.75 కోట్లు మంజూరయ్యాయని, 4నెలల్లో నిర్మాణం పూర్తి చెస్తామని ఆన్నారు. కార్యక్రమంలో నారాయణపేట ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వాహిద్, ఏఎంసీ డైరెక్టర్ శివారెడ్డి, సర్పంచ్ అమరేందర్రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ చంద్రశేఖర్, డీఎస్పీ సత్యానారాయణ, సీఐ సీతయ్య తదితరులు పాల్గొన్నారు.