నవాబ్పేట, జనవరి 14 : క్రీడల్లో గ్రామీణ యువత ప్రతిభకనబర్చి జాతీయ, అంతర్జాతీయస్థాయి టోర్నీల్లో రాణించాలని మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ విస్లావత్ చందర్నాయక్ పేర్కొన్నారు. మండలంలోని కొల్లూరు, బట్టోనిపల్లితండాల్లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను పోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
కాగా కొల్లూరులో విజేతగా నిలిచిన టాప్క్లాస్ ఎలెవన్ జట్టుకు రూ.15వేల నగదు, ట్రోఫీని సర్పంచ్ సౌజన్యారఘు అందజేశారు. రన్నర్గా నిలిచిన గేమ్ చేంజెస్ జట్టుకు రూ.10వేల నగదును గ్రా మానికి చెందిన రాజు బహూకరించారు. అలాగే బట్టోనిపల్లితండాలో నిర్వహించిన టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు బీఆర్ఎస్ నాయకుడు మా న్యానాయక్ రూ.10వేలు, రన్నర్గా నిలిచిన జట్టు కు రూ.5వేల నగదుతోపాటు ట్రోఫీని ఎంపీటీసీ తుల్సీరాంనాయక్ అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్గౌడ్, కృష్ణయ్య, మల్లేశ్యాదవ్, రామకృష్ణ, అరవింద్, చెన్నకేశవులు, లింగంమూర్తి, మెండె శ్రీను, రఘుగౌడ్, మాన్యానాయ క్, సక్రూనాయక్, రాంకుమార్, పాండూనాయక్, అర్జున్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.