మహబూబ్నగర్ టౌన్, జనవరి 24 : ఫీవర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపాలిటీలోని నవభారతి పట్టణ మహిళా సమాఖ్య (మెప్మా)లో సోమవారం మున్సిపల్ మెప్మా, ఆర్పీలకు హై జీన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కిట్లను పంపిణీ చేశారు. సర్వే ని ర్వహించే మున్సిపల్, వైద్య సిబ్బందికి పూర్తి సమాచారం అం దించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిబ్బంది జాగ్రత్త లు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు, నాయకులు, మోప్మా టీ ఎంసీ వరలక్ష్మి, సీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న ఫీవర్ సర్వే లో భాగంగా సోమవారం మున్సిపాలిటీలోని 8, 17, 20వ వా ర్డుల్లో లక్ష్మి, కమిషనర్ సునీత ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఫీ వర్ సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి కరోనా పై అవగాహన కల్పించారు. జలుబు, దగ్గు, ఒంటినొప్పులు, జ్వ రం లక్షణాలున్న వారికి మందులను పంపిణీ చేశారు. వివిధ ల క్షణాలతో బాధపడుతున్న వారందరూ హోం ఐసొలేషన్లో ఉం డాలన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌ తిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 9వ వా ర్డులో నక్కలబండతండాలో కౌన్సిలర్ చైతన్యచౌహాన్ ఆధ్వర్యం లో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఇంటి పరిసరాలతోపాటు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పలు వార్డుల్లో వైద్య సి బ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వేను చేపట్టారు. వేర్వేరు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
సర్వేకు మంచి స్పందన
ప్రభుత్వం చేపడుతున్న ఫీవర్ సర్వే కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ చెన్నకిష్టన్న తెలిపారు. సో మవారం మండలవ్యాప్తంగా సర్వేను వైద్య బృం దం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ఇంటింటికీ వైద్య బృందం వెళ్లి కుటుంబ స భ్యులను ఆర్యోగ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు ఆయ న తెలిపారు. బూస్టర్ డోస్కు అర్హులైన వారు వెంటనే వేసుకోవాలన్నారు. టీకా ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో రామయ్య, సూపర్వైజర్ యాదమ్మ, హెచ్ ఏ ప్రమోద్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు త దితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న సర్వే
మం డలంలో ఆరోగ్య సర్వే కొనసాగుతున్నది. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకొని మందులను అందజేస్తున్నారు. మరికొందరికి టీకా వేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, ఏపీఎం సుదర్శన్, మిషన్ భగీర థ ఏఈ యాదయ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.