రాత్రయ్యిందా.. కిరాణా సామాను కొనుగోలు చేయాలన్నా.. బట్టలు తెచ్చుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా కష్టమే. ఇకపై ఇలాంటి ఇక్కట్లు తీరనున్నాయి. ప్రతి రోజూ 24 గంటలపాటు వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాయంత్రమే షాపింగ్ చేద్దాం, రాత్రి అయ్యింది దుకాణం మూసేద్దామనే తొందరపాటు ఇక ఉండదు. ఇది వ్యాపారులకు, ప్రజలకు లాభదాయకం కానున్నది. అయితే పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఉండే నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే ఈ వ్యాపారం జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నది.
నాగర్కర్నూల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగా ణ) : ఏ ప్రభుత్వమూ సాహసించలేని విధానపరమైన చర్యలను సీఎం కేసీఆర్ సర్కార్ ప్రజల కో సం తీసుకుంటున్నది. ఇప్పటివరకు కిరాణ సరుకులు, బట్టలు, మొబైల్స్ ఇలా ఏది కొనాలన్నా.. హోటల్కు వెళ్లి టిఫిన్లు, స్నాక్స్ తిందామన్నా రాత్రి 9 గంటల వరకు పూర్తి చేసుకుంటుంటాం. వ్యాపారులు దుకాణాలను రాత్రి 10 గంటల వరకు మూ సివేస్తున్నారు. ఒక్క మెడికల్ షాపులకు మాత్రమే 24 గంటల పాటు తెరుచుకునే అవకాశం ఉన్నది. హైదరాబాద్లో చార్మినార్ వంటి కొన్ని ప్రాం తాల్లో మాత్రమే దుకాణాలను రాత్రివేళ ఆలస్యంగా మూస్తారు. ఇప్పటివరకు ఉన్న ఈ నిబంధనతో ప్రజలకు అప్పుడప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని వ్యాపారాలకు అధికంగా రద్దీ ఉంటుంది. ప్రజలు వచ్చే అవకాశమున్నా రాత్రి 10 గంటల వరకు మూసివేయాల్సి వస్తున్నది.
ఇది ప్రజలు, వ్యాపారులకు కష్టంగా ఉంటున్నది. ఈ పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం ఇకపై 24 గంటల పాటూ దుకాణాలు తెరుచుకునే అవకాశం కల్పించింది. ఇటీవలే విధానపరంగా నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రా ష్ట్రంలో నిరంతరాయంగా దుకాణాలు తెరిచి ఉం చుకోవచ్చు. దీనికి సంబంధించి కార్మిక శాఖ నుం చి ఏడాదికి రూ.10వేలు చెల్లించి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం దు కాణాల్లో పని చేసే కార్మికులకు అదనంగా వేతనం ఇవ్వాలి. అలాగే గుర్తింపు కార్డులు, వారాంతపు, పండుగ సెలవులు, రవాణా సదుపాయం, భద్రత చర్యలు సంబంధిత వ్యాపార నిర్వాహకుల బా ధ్యత. మహిళల అనుమతి తీసుకొని పని చేయించుకోవాలి. బలవంతంగా ఎవ్వరినీ పనిలో పెట్టుకోవద్దు. దీనివల్ల ప్రజలు, వ్యాపారులు, పనిచేసే ఉద్యోగులు, కార్మికులకూ ప్రయోజనం కలగనున్నది.
సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది, రం జాన్, బక్రీద్, క్రిస్మస్ వంటి ముఖ్య పండుగల రో జు మాత్రమే వ్యాపారాలు అధికంగా జరుగుతా యి. అందులో బంగారు, బట్టల దుకాణాలకే అధికంగా ప్రయోజనం కలుగుతుంది. బట్టలు కొనుగోలు చేసేందుకే మహిళలు అధిక సమయం తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అక్కడ కొనుగోలు చేసే ప్రజలకు ఈ ని ర్ణయం మేలు కలిగిస్తుంది. అలాగే హోటల్స్, రెస్టారెంట్ల వంటి వ్యాపారాలకూ ప్రయోజనం చేకూరనున్నది. కాగా, మున్సిపాలిటీల్లో 24గంటల పా టు తెరిచి ఉంచే పరిస్థితులు ఉండవని కార్మిక శాఖ అధికారుల అంచనా. కాగా వైన్స్ షాప్లకు ఈ ని బంధన వర్తించదు. ఎప్పటిలాగే రాత్రి 10గంటల వరకే మూసి వేసి ఉంచాలి. ఈ జీవో వల్ల నా గర్కర్నూల్ జిల్లాలోనే దాదాపుగా 2వేల వరకు దు కాణాల యజమానులకు లబ్ధి చేకూరనున్నది.
నిరంతరం ఓపెన్ చేయొచ్చు..
రాష్ట్రంలో 24గంటలపాటు వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఈనెల 4న జీవో జారీ చేసింది. కార్మిక శాఖకు రూ.10 వేలు చెల్లించి అనుమతులు తీసుకోవాలి. ఇందులో ఉద్యోగుల వివరాలు అందజేస్తూ కార్మికులకు అదనపు పని గంటలకు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జీవో ద్వారా ఏ వ్యాపార సంస్థ అయినా ఎప్పుడైనా దుకాణాలు తెరుచుకోవచ్చు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రిజిస్టర్డ్ చేసుకున్న వ్యాపార సముదాయాలు 378 వరకు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు 24గంటల పాటు దుకాణాలు తెరుచుకోవడానికి వ్యాపారులు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు.
– అబ్దుల్ షఫీయుద్దీన్, కార్మిక శాఖ అధికారి, నాగర్కర్నూల్