భక్తిభావంతో పాదయాత్ర మహాశివరాత్రి పర్వదినానికి వేళైంది. మరో మూ డ్రోజుల్లో పండుగ రానున్నది. కానీ అంతకంటే వా రం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులో ము ఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది. హిందువులందరికీ శివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ. ఇందులో భాగంగా ఉపవాస దీక్షలతోపాటు శివాలయాల్లో పూజలు చేసి భక్తిని చాటుకొంటుంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ జ్యో తిర్లింగ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, శక్తిపీఠమైన భ్రమరాంబదేవిని దర్శించుకునేందుకు శివభక్తులు పయనమయ్యారు.
నియమ నిష్టలతో మాలధారణ చేసిన స్వాములు వివిధ ప్రాంతాల నుంచి శ్రీగిరికి పాదయాత్ర చేపట్టారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి 130 కి.మీ., పాలమూరు నుంచి 180 కి.మీ. దూరంలో క్షేత్రం విరాజిల్లుతోంది. అలాంటి మహిమాన్విత క్షేత్రానికి మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా భ క్తులు తరలివెళ్తుంటారు. కాగా కాలినడకన వెళ్లడం ఈ క్షేత్రం మహిమాన్వితాన్ని మరింత పెంచుతోంది. ఉమ్మడి జిల్లాతోపాటు కర్ణాటక నుంచి సైతం వేలాది మంది శివరాత్రి వరకు స్వామి సన్నిధికి చేరుకునేందుకు యాత్రగా బయలు దేరారు. వారి వారి ప్రాం తాల నుంచి పండుగ వరకు చేరుకునే రోజులను బట్టి శివ భక్తులు కాలినడకను ఆరంభించారు.
ఇలా పది రోజుల ముందు నుంచే యాత్ర మొదలుపెట్టారు. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, జడ్చర్ల, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి సైతం స్వా ములు ఇరుముడులతో చేరుకొంటున్నారు. గుంపు లుగుంపులుగా యాత్రికులు శివనామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు. మహబూబ్నగర్ నుంచి శ్రీశై లం వరకు ప్రధాన రహదారి శివ భక్తులతో సందడి గా మారింది. రాత్రీపగలు తేడా లేకుండా యాత్ర చే పట్టడం విశేషం. ఎండ, చలిని సైతం లెక్క చేయకుండా.. భక్తి పారవశ్యంతో ముందుకు కదులుతున్నారు. శివ స్వాములతోపాటు భక్తులు సైతం మొ క్కుగా పాదయాత్ర చేపట్టి శ్రీశైలం చేరుకుంటున్నారు.
శివస్వాములు పాదయాత్రగా నల్లమల అడవి మీ దుగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అభయారణ్యాన్ని సైతం లెక్కచేయకుండా యాత్ర కొనసాగిస్తున్నారు. ఎత్తయిన కొండలను ఎక్కుతూ, దిగుతూ స్వామి సన్నిధి కి చేరుకుంటున్నారు. ఓవైపు కాళ్లు, శరీరం నొ ప్పులు పెడుతున్నా, వాపులు, బొబ్బలు వ చ్చినా.. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా, చేత్తో కర్రను ఊతం చేసుకుంటూ దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పయనిస్తున్నారు.
శివస్వాములు పాదయాత్ర చే పట్టిన నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. నల్లమల అ టవీ ప్రాంతంలో, రోడ్ల వెం ట యాత్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసు శాఖ ని రంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. అభయారణ్యం లో జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నది. అభయారణ్యం లో చిరుతలు, పెద్దపులుల కదలికలపై జాగ్రత్తగా ఉండాలని సూ చిస్తున్నారు. రోడ్లకు ఎడమ వైపున నడవడం, రోడ్లపై విశ్రాంతి తీసుకోరాదని, అడవిలో మంటలు పెట్టరాదని, ప్లా స్టిక్ సామగ్రి ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని పోలీస్, ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.
ఆదిభిక్షువు సేవలో శివస్వాములు తరిస్తున్నారు. జగద్రక్షకుడి పూజకు అశేషంగా ఆరాటపడుతున్నారు. మదినిండా మనోహరుడిని స్మరిస్తూ శ్రీగిరికి వేలాది సంఖ్యలో కాలినడకన పయనమయ్యారు. దీంతో నల్లమల అభయారణ్యంలో పంచాక్షరి జపం ప్రతిధ్వనిస్తున్నది. శంభో శంకరా.. హరహర మహాదేవా.. ఈశ్వరా.. పరమేశ్వరా.. ఓం నమఃశివాయ.. శివోహం.. వస్తున్నాం మల్లన్నా.. అనే నామస్మరణతో నిత్యం పులకించిపోతున్నది. పల్లె మొదలు పట్నం వరకు.. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు తెలంగాణ నుంచి మాలధారులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నారు.
రాత్రి, పగలు తేడా లేకుండా మండుటెండను సైతం లెక్క చేయకుండా భక్తిభావనలో కైలాస నాథుడిని తలుస్తూ ముందుకు కదులుతున్నారు. రోడ్లన్నీ శివభక్తులతో సందడిగా మారాయి. 8న మహాశివరాత్రి వేడుక రోజు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేలా ముందు నుంచే యాత్రలు చేపట్టగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. దాతల సేవాభావం స్వాములకు అడుగడుగునా అందుతున్నది.
మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లి స్వామివారిని మొక్క డం ఆనవాయితీగా వ స్తోంది. మల్లన్న సన్నిధికి కాలినడకన వెళ్లడం ఇది 13వ సారి. మా ఊరి నుం చి శ్రీశైలానికి 200 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. 30 మందిమి కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఐదు రోజులు నడిచి శ్రీశైలానికి చేరుకుంటాం. రాత్రి వేళ పడుకొని ఉదయం, సాయం త్రం పూట నడుస్తాం. ఎండ ఎక్కువైతే మధ్యలో నీడ చూసుకోని విశ్రాంతి తీసుకుంటాం.
– కృష్ణయ్య, దొడ్డుపల్లి, నవాబ్పేట మండలం
కాలినడకన వెళ్లడం కొం చెం ఇబ్బంది గా ఉన్నా స్వామిని త లుస్తూ వె ళ్తుంటాం. నే ను మాల ధ రించడం ఇది ఎనిమిదోసారి. మార్గమధ్యం లో చలివేంద్రాలు, మజ్జిగ, అన్నదాన, వి శ్రాంతి కేంద్రాలు ఆదుకుంటున్నాయి. శ్రీ శైలం వెళ్తే మంచి జరుగుతుందని చాలామందికి నమ్మకం. అందుకే ఎన్ని ఇబ్బందు లు ఎదురైనా కాలినడకన వెళ్తాం. ఇరుము డి సమర్పించి మల్లన్నను దర్శించుకుని మ రుసటిరోజు తిరిగొస్తాం.
– నరేశ్, శివమాలధారుడు, పోలేపల్లి, జడ్చర్ల మండలం
మద్దిమాల్ నుంచి కా లినడకన శ్రీశైలానికి వె ళ్తున్నాం. మా ఆయన శి వమాల ధరించాడు. నే ను కాలినడకన వెళ్లడం ఇది మూడోసారి. శ్రీశై లం వెళ్లి స్వామిని చూ డాలనేది మా కోరిక. నా లుగు రోజులుగా నడుస్తున్నాం. మరో రెండు రోజుల్లోని శ్రీశైలానికి వె ళ్తాం. స్వామిని తలుచుకుంటూ నడక సాగిస్తున్నాం. రాత్రి అయితే మా వెంట వెహికిల్ ఉంటుంది. మధ్యలో పడుకొని తెల్లవారాక నడుస్తాం. మా ఏరియా నుంచి వేలమంది నడుచుకుంటూ వస్తారు.
– లక్ష్మి, మద్దిమాల్ గ్రామం, వికారాబాద్ జిల్లా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి శివస్వా ములు శ్రీగిరికి పాదయాత్ర చేపట్టారు. దీంతో పల్లె, పట్నం స్వాముల యాత్రతో సందడిగా మారాయి. నాగర్కర్నూల్ పట్టణం మీదుగా యాత్రికులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. కర్ణాటక, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన భక్తు లు, స్వాములు జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు, తాండూరు, కోస్గి నుంచి వచ్చే భక్తులు నాగర్కర్నూల్, అచ్చంపేట, మన్ననూరు మీదుగా శ్రీశైలానికి వెళ్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రాంతాల వాసులు, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్, కల్వకుర్తి, హాజీపూర్, మన్ననూరు మీదుగా శ్రీగిరికి చేరుకుంటున్నారు. కొల్లాపూర్, పాన్గల్, వీపనగండ్ల, పెబ్బేరు నుంచి వచ్చే భక్తులు లింగాల మీదుగా అటవీ ప్రయాణం చేసి కైలాసవాసుడి సన్నిధికి చేరుకుంటున్నారు.
రహదారులన్నీ శివభక్తులతో సందడిగా మారాయి. దాత లు ముందుకొచ్చి సేవాభావం చాటుతున్నారు. పట్టణ శివా రు ప్రాంతాల్లో విడిది చేస్తున్న శివస్వాములు, భక్తులతో వా రం ముందే ఈ ప్రాంతం శివరాత్రి శోభను సంతరించుకున్న ది. ఇక శివ స్వాముల కోసం కుల, మతాలకతీతంగా ప్రజానీకం స్పందిస్తున్నది. శ్రీశైలం రహదారి పొడవునా అల్పాహారం, భోజనం, పండ్లు పంపిణీ చేస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు రోడ్లు, శివారు ప్రాంతాల్లో టెంట్లు వేసి నీ డ, నీళ్లను అందిస్తున్నారు. విడిది కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. అన్నదానాలు, ఫలహారాలు, నీటి వసతితోపాటు రెస్ట్ తీసుకునేలా వసతులు కల్పించి వారి సేవలో తరిస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారికి మందులు అందిస్తూ స్వాములపై ప్రేమను చాటుకొంటున్నారు. స్వాముల యాత్రతో నల్లమలలో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది.