అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని టీటీదొడ్డి గ్రామంలో గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పొట్టేళ్ల పందెం పోటీలను ఆలయ కమిటీ నిర్వహిం చింది. పోటీలకు 17పొట్టేళ్ల తీసుకరావడంతో తలపడ్డాయి. పోటీల్లో ప్రథమ బహుమతి కర్నూలు జిల్లా దామగట్లకు చెందిన భార్గవ్కు చెందిన పొట్టేలు, ద్వితీయ బహుమతి కర్నూలు జిల్లా ఆదోని మండలం పెకడుమూరుకు చెందిన సిద్దార్థ పొట్టేలు, తృతీయ బహూమతి హైదరాబాద్ సనత్నగర్కు చెందిన కాళీకి చెందిన పొట్టేలు, నాలుగో బహుమతి కర్నూలు జిల్లా ఎంబాయికి చెందిన ఆంధ్రమౌలికి చెందిన పొట్టేలు గెలుపొందింది. గెలుపొందిన పొట్టేళ్ల యజమానులకు ఆలయ కమిటీ నగదు బహుమతులను అందజేసింది.