నారాయణపేట, డిసెంబర్ 9 : క్రీడాకారులు ఉత్తమ ప్ర తిభ చాటి జాతీయస్థాయిలో రాణించాలని షీ టీమ్స్ జిల్లా ఇన్చార్జి, ఎస్సై సుధామాధురి, ఉమ్మడి జిల్లా వాలీబాల్ ఆ ర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య అన్నారు. జనవరి 12, 13, 14 తేదీల్లో బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో అండర్ 14, 16 జాతీయస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ బాలబాలికల పో టీలు కొనసాగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు శుక్రవా రం పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రమణ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఖేలో ఇండియా అథ్లెటిక్స్ సెంటర్ మంజూరైనట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞాతలు తెలియజేస్తూ, క్రీడాకారుల తరఫున హర్షం ప్రకటించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్ జగదీశ్, పీఈటీ లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మరికల్, డిసెంబర్ 9 : మంచిర్యాల జిల్లాలో ఈనెల 16 నుంచి నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థి కావేరి ఎంపికైందని గౌతమి పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భం గా కావేరిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం పాఠశాల ఆ వరణలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థిని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడంపై కావేరి తల్లిదండ్రులు, కోచ్ మహేందర్ హర్షం వ్యక్తం చేశారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 9 : రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 24 మంది క్రీడాకారులు మహబూబాబాద్ జిల్లాకు తరలివెళ్లారని తెలంగాణ షూటిం గ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వి శ్రాంత పీఈటీ గోపాలం అన్నారు. పట్టణంలో ని స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం షూటింగ్ బాల్ క్రీడాకారులకు దుస్తులను అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు బయల్దేరారన్నారు. గత నెలలో మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడాకారుల ఎంపిక చేపట్టామన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ కు వెళ్లిన క్రీడాకారులను షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, టగ్ ఆఫ్ వార్ జిల్లా అధ్యక్షుడు రఘుప్రసన్న భట్, మాస్టర్ అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు సత్యాంజనేయు లు, క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.