వనపర్తి, ఆగస్టు 11 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల పథకం రిజర్వాయర్ మీద సంబురాలు నిర్వహించాలని, రై తన్నలతో కలిసి సంతోషాన్ని పం చుకోవాలని.. ఇది తెలంగాణ విజయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పీఆర్ఎల్ఐకి పర్యావరణ అనుమతులు లభించడంతో కష్టాలు తీరినట్లేనని మంత్రి వెల్లడించారు. పీఎల్ఆర్ఐ ప్రాజెక్టు రెండేండ్ల కిందటే పూర్తి కావాల్సి ఉం డగా.. ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, కేంద్రం సహకరించక ఆలస్యమైందన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 85 శాతం పనులు పూర్తి చేశామని.. త్వరలో మిగిలిన పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామన్నారు. పీఆర్ఎల్ఐ పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాది రైతులతో సం బురాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చా రు. పాలమూరు కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమని, కాళేశ్వరం పంపుల సామర్థ్యం 139 మెగావాట్లు కాగా పీఆర్ఎల్ఐ పంపుల సామర్థ్యం 145 మెగావాట్లు అని తెలిపారు. లక్షా 96,500 హార్స్ పవర్తో రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసేలా పనులు జరుగుతున్నాయన్నారు.
నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ (6.5 టీఎంసీలు) వద్ద త్వరలో డ్రైరన్కు సన్నాహాలు అవుతున్నాయని, నెలాఖరుకు మొదటి పంపు ప్రారంభమవుతుందన్నారు. ఏదుల, వీరాంజనేయ (6.55 టీఎంసీలు) పంప్హౌస్ను రెండేండ్ల రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. 1,299మంది ముంపు బాధితులను గుర్తించి రూ.20.5కోట్ల పరిహారం అందజేశామన్నారు. 50వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్తోపాటు కరివెన కురుమూర్తిరాయ రిజర్వాయర్ (19 టీఎంసీలు) ఉదండాపూర్ రిజర్వాయర్ (16.03 టీఎంసీలు) 9.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. పీఆర్ఎల్ఐతో జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కేసీఆర్ సంకల్ప బలమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావడానికి కారణమన్నారు. రాబేయే పదేండ్లలో పాలమూరు కోనసీమకు మరిపిస్తుందని, హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు దారి పొడవునా పచ్చదనం పర్చుకుంటుందన్నారు.