ఘనంగా షాఅలీ పహిల్వాన్ ఉర్సు పెద్ద కిస్తీ
భారీగా తరలివచ్చిన భక్తులు
పాల్గొన్న ఎమ్మెల్యే అబ్రహం, పహిల్వాన్లు
అలంపూర్, జూన్ 24 : పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు సయ్యద్ సలీమొద్దీన్ అహ్మద్ ఖాద్రి, ఓవైస్ అహ్మద్ ఖాద్రి, ఖాదర్వలీ ఇంటి నుంచి మొదటగా సర్కార్ కిస్తీ పెద్ద దర్గా వద్దకు చేరుకోగా అనంతరం భక్తులు, యూనియన్, కుల సంఘాలు పెద్దమొత్తంలో ప్రసాదాన్ని త యారు చేసి ఎడ్లబండ్లపై, ఆటోలు, ఇతరత్రా వాహనాలపై మేళతాళాల మధ్య డప్పులతో ఊరేగింపుగా తీసుకొచ్చి కిస్తీలో సమర్పించారు. ఈ వేడుకకు పక్క రాష్ర్టాల నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి భక్తులు ప్రసాదాలను తయారు చేసుకొచ్చి కిస్తీలో సమర్పించారు. ఈ ప్రసాదాన్ని భక్తులకు అందజేయడానికి పహిల్వాన్లు పో టీపడ్డారు. కిస్తీ నుంచి పరిసరాల్లోకి పహిల్వాన్లు ప్రసాదాన్ని విసిరేయగా.. భక్తులు కళ్లకు అద్దుకొని మహాప్రసాదంగా స్వీకరించారు. ఈ సందర్భంగా పహిల్వాన్ల వి న్యాసాలు, బలప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులు ఆ సక్తిగా తిలకించారు. దర్గా పరిసరాల్లో ఆట వస్తువులు, రంగులరాట్నాలు వెలిశాయి. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ సూర్యనాయక్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు శ్రీహరి, కుర్మయ్య, సంతోష్, వెంకటస్వామి, శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉర్సు సందర్భంగా పట్టణంలో తట్టీల ఊరేగింపు నిర్వహించారు. పటాన్ వీధి, అక్బర్పేట నుంచి తెల్లవారుజామున బయలుదేరాయి.
పాల్గొన్న ఎమ్మెల్యే
ఉత్సవాలకు ఎమ్మెల్యే అబ్రహం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత సామరస్యానికి ప్రతీకగా వందల ఏండ్ల నుంచి హిందూ ముస్లింలు ఐకమత్యంతో ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. భక్తులకు ఇ బ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ము న్సిపల్ చైర్పర్సన్ మనోరమ, కమిషనర్ నిత్యానంద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేశ్, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, జెడ్పీటీసీ కాశపోగు రాజు, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్గౌడ్, వెంకట్రామయ్యశెట్టి, నర్సన్గౌడ్, బైరాపురం రమణ, క్యాతూరు నాగమ య్య, ఉర్సు కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు అ ల్లా బకాష్, షేక్ హుస్సేన్వలీ, ఫకీర్లు, భక్తులు ఉన్నారు.