మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 1 : రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మంత్రి తల్లిదండ్రులు శాంతా నారాయణ స్మారక టోర్నీ ముగింపులో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించి పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు పురస్కరాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే క్రీడాకారుకుల 2 శాతం క్రీడా కోటా అమలు చేస్తున్నామన్నారు. అనంతరం విజేత అయ్యప్ప ఎలెవెన్ జట్టుకు రూ.లక్ష, రన్నర్ రామిరెడ్డి ఎలెవెన్ జట్టుకు రూ.50 వేల నగదు, ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహలు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, నిర్శాహకులు నరేశ్, రాజేశ్, పవన్, రాజేందర్, గిరి, వీరేశ్, ప్రేమ్ పాల్గొన్నారు.
– క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్