బాలానగర్, మార్చి 11 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్కు ఎంతో ప్రజాదరణ లభిస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదారాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం జాలుగడ్డతండాకు చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా టీఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్కు వలసల బాట పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.