మరికల్, డిసెంబర్ 23: ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకు ల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు.
సంతోశ్, శంకర్ ఈనెల 25 నుంచి 28వరకు కోల్కతాలో సాటిలాక్ సాయి కాంప్లెక్స్లో నిర్వహించే 35వ జాతీయస్థాయి నెట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కోచ్ రామ్మోహన్గౌడ్, వైస్ప్రిన్సిపాల్ సురేశ్రావు, పీఈటీ నాగమణి, మాస్టర్ సంతోష్ ఆభినందించారు.