మహబూబ్నగర్, జనవరి 24 : నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. సమీకృత కార్యాలయ అవరణలో సుందరీకరణ పనుల్లో భాగంగా పెద్ద మొక్కలు నాటడం, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరుగకుండా చూడాలని సూచించారు. సెంట్రల్ లైటింగ్, అవసరమైన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై జాతీయ రహదారుల సంస్థ, ఆర్అండ్బీ విద్యుత్ అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్అండ్బీ ఎస్ఈ లింగారెడ్డి, విద్యుత్ ఎస్ఈ మూర్తి, ఈఈలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆన్లైన్ ద్వారా ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఫోన్ 7330664001 నెంబర్ ద్వారా ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. కరోనా తగ్గినప్పుడు తిరిగి ప్రత్యక్షంగా ఫిర్యాదులను స్వీకరిస్తామని ఆయన చెప్పారు. పెన్షన్లు, వ్యక్తిగత సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, ఆర్డీవో పద్మశ్రీ, ఏవో ప్రేమ్రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.