మహబూబ్నగర్, మార్చి 12 : మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, ఎన్నికల కమిషన్ పరిశీలకురాలు వాణిప్రసాద్ పరిశీలించారు. 13 మంది నా మినేషన్లు ఆమోదించగా, ముగ్గురి పత్రాలను తిరస్కరించారు. అయితే, 14వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు అని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్ల కు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుం చి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను పరిష్కరించి తప్పులు లేకుం డా జాబితాను రూపొందించాలన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని 13వ తేదీ లోగా పంపించాలన్నారు. వీసీలో అధికారులు పాల్గొన్నారు.