మహబూబ్నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 29 : పదో తరగతి ఫలితాల్లో పంచవటి విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారని ఆ పాఠశాల కరస్పాండెంట్ టీ.అనితారెడ్డి తెలిపారు. అజ్రాతబస్సుమ్ 592, అనన్యశ్రేష్ణ 590, ప్రణీత్రెడ్డి 588, అభిరామ్ 588 మార్కులతో టాపర్స్గా నిలిచారన్నారు.
మ్యాథమెటిక్స్లో 33 మంది, తెలుగు లో 12 మంది, సోషల్లో 8 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించినట్లు చెప్పారు. 550కి పైగా మార్కులు 146 మంది విద్యార్థులు సాధించగా, 62 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని పేర్కొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ టీ. శ్రీకాంత్రెడ్డి, కరస్పాండెంట్ అనితారెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటరమణ అభినందించారు.