సారిక టౌన్షిప్లో ఈనెల 25వరకు అవకాశం
కలెక్టర్ వెంకట్రావు వెల్లడి
మహబూబ్నగర్, జూన్ 20 : తక్కువ గజాల్లో అందరికీ అందుబాటులోని సారిక టౌన్షిప్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు వేలం పాటలో పాల్గొనాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వైట్హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ స్వగృహ సారిక టౌన్షిప్లోని ప్లాట్ల వేలం పాట అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 25వరకు వేలంపాట కొనసాగుతుందన్నారు. 348 ప్లాట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని, టౌన్షిప్లో విశాలమైన రహదారు లు, మురికి కాలువలు ఉన్నాయన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలో 7వ వార్డు పరిధిలోకి వచ్చే సారిక టౌన్షిప్ నూతన కలెక్టరేట్ కూత వేటు దూరంలో ఉందన్నారు. మున్సిపాలిటీ ద్వారా అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రుణాలు అవసరమైన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకు రుణసౌకర్యం క ల్పిస్తామన్నారు.
వేలంలో 45 ప్లాట్లకుగానూ రూ.15.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సుమారు 190 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. అత్యధికంగా రూ.19వేలు చదరపు గజం, అత్యల్పంగా రూ.8100 చొప్పున వేలంపాటలో పాడి ప్లాట్లను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్లాట్లు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కిందికి వస్తాయని తెలిపారు. ఈ నెల 25వరకు అప్పన్నపల్లి సమీపంలోని వైట్హౌస్లో ప్లాట్ల బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలే కాకుండా ఇతరులు కూడా వేలంలో పాల్గొని ప్లాట్లు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, కలెక్టర్ ఏవో కిషన్ ఉన్నారు.