వనపర్తి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. తన ఓటమి కంటే కామారెడ్డిలో తెలంగాణ ఉద్యమ శిఖరం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమిని తాను జీర్ణీంచుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, జిల్లా ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మ య్య, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్తో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము గెలిచిన రోజు పొంగిపోలేదని, నేడు ఓటమి ద్వారా కుంగిపోయేది లేదన్నారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని, ప్రజల కోణం తెలుసుకుంటామని అన్నారు. నిత్యం గ్రామాల్లోనే ఉండి ప్రజల చెంతనే ఉంటామని, ఓటమి చెందినంత మాత్రానా ఎక్కడికి వెళ్లేది లేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపైన తామే పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీతోపాటు అనేక మంది ముఖ్యమంత్రులు ఓడిపోయిన సందర్భాలను చూస్తూనే ఉన్నామన్నారు.
తాను సహి తం ఓటమి ద్వారానే గెలుపును సొంతం చేసుకున్న వాడినేనన్నారు. నా ఓటమి నన్ను బాధించలేదని, కా మారెడ్డిలో తెలంగాణ ఉద్యమ కెరటం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని సింగిరెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏనాడు రాష్ట్ర సాధనలో పాలుపంచుకోని వారు రాష్ట్రం సాధించిన నేతను ఓడించ డం అత్యంత బాధకరమన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, వారిచ్చిన హామీల అమలు చేయడంపైనే తాము దృష్టి పెడతామన్నారు. కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలను తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఆరు నెలల్లోనే తేటతెల్లం అవుతుందని సింగిరెడ్డి పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనుల్లోనే తాము ఎప్పటికీ గుర్తుంటామని, విద్యాసంస్థలు, రిజర్వాయర్లు, పంట కాల్వలు, సాగవుతున్న పచ్చని పైర్లు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయన్నారు. ఏడాదిపాటు సొంత పార్టీలో ఉండి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి తాత్కాలిక లబ్ధిపొందారన్నారు. నాలుగైదు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సహితం చేయలేని పనులను ఒక్క అవకాశంలోనే చేసి చూయించామని, ప్రజల నుంచి తనను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. దేనిని గుడ్డిగా వ్య తిరేకించమని, హుందాగా రాజకీయాలు చేశామని, ఇకముందు కూడా అదే బాటను అనుసరిస్తామని ప్రకటించారు.
రైతుబంధును తక్షణమే ఇవ్వాలి
కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తక్షణమే యాసంగిలో 75లక్షల మంది అన్నదాతలకు రైతుబంధును విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. తాను వ్యవసాయ మంత్రిగా 90శాతం రైతు రుణ మాఫీని పూర్తి చేయడం జరిగిందని, ఇక కేవలం 10శాతం మాత్రమే మిగిలి ఉన్న రుణమాఫీని సహితం వా రం రోజుల్లో అమలు చేయాలన్నారు. కొత్త ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యాసంగిలో రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో నాయకులు తిరుమల మహే శ్, వాకిటి శ్రీధర్, పురుషోత్తంరెడ్డి, రాములుయాదవ్, కురుమూర్తి యాదవ్, కృష్ణానాయక్, లక్ష్మా రెడ్డి, గౌని బిచ్చారెడ్డి, నందిమళ్ల అశోక్, శ్యాం పాల్గొన్నారు.