మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 30 : రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఆడపడుచుల కోసం ఆర్టీసీ సంస్థ లక్కీ డ్రా నిర్వహిస్తున్నది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50లక్షల విలువైన బహుమతులను అందించనున్నారు. రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున బహుమతులు అందజేయనున్నారు.
ఈనెల 30,31 తేదీల్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనొచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్నెంబర్ రాసి బస్టాండ్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయాలి. లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేసి సమాచారం అందజేయనున్నారు. బుధవారం రాఖీ పండుగ సందర్భంగా మహబూబ్నగర్ బస్టాండ్ రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికులతో బస్సులు రద్దీగా మారాయి. రద్దీ రూట్లలో అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు.