ఊట్కూర్, డిసెంబర్ 4 : ప్రత్యే క ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రా మాల్లో బీఎల్వోలు కొత్త ఓటర్ల న మోదు ప్రక్రియను చేపట్టారు. ఆదివారం రెండోరోజూ చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని తాసిల్దార్ సీహెచ్.తిరుపతయ్య పర్యవేక్షించా రు. మండలంలోని పులిమామిడి కస్తూర్బా గాంధీ కళాశాలలో విద్యార్థుల నుంచి ఓటరు నమోదు కోసం వీఆర్ఏ భీంరావు దరఖాస్తులు స్వీ కరించారు. ఓటు హక్కు నమోదుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్వో లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
కృష్ణ, డిసెంబర్ 4 : 18 ఏండ్లు నిండిని పౌరులందరూ ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని స ద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్పెషల్ ఓటరు నమోదు కా ర్యక్రమంలో భాగంగా స్థానిక పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో బీఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.