మహబూబ్నగర్ మెట్టుగడ్డ/నాగర్కర్నూల్/జడ్చర్ల/ భూత్పూర్, ఆగస్టు 15 : నిత్యం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెడ్ డైరీలో పేర్లు నమోదు చేసుకున్నామని, మీ సంగతి చూస్తామని అహంకారంతో మాట్లాడడం సరికాదని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్లపై నాగర్కర్నూల్, జడ్చర్ల, భూత్పూర్ పోలీస్స్టేషన్లలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు.
నాగర్కర్నూల్లో ఎఫ్ఐఆర్ 313/2023 U/S 153,504 ఐపీఎస్ సెక్షన్ల కింద జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ ఫిర్యాదు చేశారు. భూత్పూర్లో 184/2023,153,504,505,506 సెక్షన్ల కింద, జడ్చర్లలో 499/2023,153,504,505,506 ఐపీసీ సెక్షన్ల కింద జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు నాగర్కర్నూల్ ఎస్పీ మనోహర్, జడ్చర్ల సీఐ రమేశ్బాబు, భూత్పూర్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అనంతరం మహబూబ్నగర్లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య పాలమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల మాటలతో తమ కుటుంబాల్లో సైతం భయాందోళన నెలకొందని, ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.