మహబూబ్నగర్, సెప్టెంబర్ 6 : మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మార్కెట్లోకి అత్యాధునిక వసతులతో రెనాల్ట్ కైగర్ టర్బో నూతన కారును కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి, ట్రెండ్ గ్రూప్ శ్రీహర్షిత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. శనివారం రినాల్డ్ కార్ల ఆథరైజ్డ్ డీలర్ యుక్తా మోటర్స్ మహబూబ్నగర్ షోరూంలో నూతన కారును విడుదుల చేశారు.
ఈ సందర్భంగా హర్షిత్రెడ్డి మాట్లాడుతూ నూతన టర్బో ఎనర్జీ ఇంజిన్ కలిగిన ఈ సరికొత్త కారు భద్రతా ప్రమాణాలతో 6 ఎయిర్ బెలూన్లు, క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కలిగి గ్రామీణ రహదారులకు అనుకూలంగా గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి, మల్టీ వ్యూ కెమెరా, ఆటో హెడ్ ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 40.64 సెం.మీ. డైమండ్ కట్ ఆలాయ్ వీల్స్తో ఆరు రంగుల్లో అందుబాటులో ఉందన్నారు. పెట్రోల్ వెర్షన్తో 20.38 కి.మీ. మైలేజ్ ఇస్తుందని, ఎక్స్ షోరూం ధర రూ.6.29లక్షలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రమేశ్, సర్వీస్ మేనేజర్ సందీప్, వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.