మహబూబ్నగర్ అర్బన్, మార్చి 3: ముదిరాజ్ సం ఘం భవన్ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయిస్తున్న ట్లు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ముదిరాజ్ భవ న్ నిర్మాణానికి సహకరించాలని పట్టణానికి చెందిన ముదిరాజ్ కులస్తులు శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి అత్యాధునికంగా, అన్ని హంగులతో భవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్కకు కృతజ్ఞతలు
అడిగిన వెంటనే ముదిరాజ్ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయించిన మంత్రికి ముదిరాజ్లు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి జిల్లా కులస్తులం ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు కిషోర్ కుమార్, పటేల్ ప్రవీణ్, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకులు రాములు, రామకృష్ణ, పరమేశ్, వెంకటయ్య, భాస్కర్, శ్రీను, బాలు, శేఖర్, మదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.