వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ న్నారు. వనపర్తి, నాగర్కర్నూల్, గ ద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై వనపర్తి, నా గర్కర్నూల్, గద్వాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మం త్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ ధాన్యానికి రూ.1940మద్దతు ధర ను ప్రభుత్వం నిర్ధ్దారించిందన్నారు. వనపర్తి జిల్లాలో 220కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఉండగా, 171 కేంద్రాల ను ప్రారంభించినట్లు మంత్రి సూచించారు.
ఇప్పటివరకు 33వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మొ త్తాలను రెండు, మూడు రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మాట్లాడుతూ యా సంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ నమోదు చేసి రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని జాప్యం లేకుండా సత్వరమే చెల్లించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ కలెక్టర్లు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి అనిల్, డీపీవో, వ్యవసాయశా ఖ అధికారి, మార్కెటింగ్శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.