కోయిలకొండ, నవంబర్ 30 : ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దమాయపల్లి స్టేజీ వద్ద సీడీపీ నిధులు రూ.6 లక్షలతో నిర్మించిన బస్షెల్టర్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని వివరించారు.
వ్యవసాయాన్ని పండుగలా మార్చి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నా రు. మండలంలోని ఖాజీపూర్లో బస్షెల్టర్ పనులను త్వరలోనే పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్యయాదవ్, సర్పంచులు హన్మంతు, ఆంజనేయులు, ఎంపీటీసీ రవికిరణ్రెడ్డి, ఎంపీడీవో జయరాం, రాజేంద్రప్రసాద్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నాగయ్య, ప్రవీణ్చారి, మాధవరెడ్డి, రా జవర్దన్రెడ్డి, మాధవులు, బాలయ్య, అంకిళ్ల రవి ఉన్నారు.