వనపర్తి టౌన్, డిసెంబర్ 16 : ప్రజల సోమ్ము జనాలకే దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్ 22వ సంయుక్త మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాల నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎల్ఐసీకి ప్రత్యేక నేప థ్యం, చరిత్ర ఉందని, పశ్చిమాసియా దేశాల్లో వస్తున్న పరిస్థితులను గమనించిన మొదటి ప్రధాని నెహ్రూ దేశంలో ప్రభుత్వపరంగా ఉన్న మౌలిక రంగాలను ప్రభుత్వంలోనే ఉంచేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెహ్రూ పొందుపర్చారన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రైవేట్ ఆధీనంలో ఉన్న పరిశ్రమల లెక్కలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రజల ముందు ఉంచగలరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తి ప్రయోజనాలే ఉంటాయని సామూహిక ప్రయోజనాలు ఉండవని తెలిపారు.
ఎల్ఐసీ సంస్థ అంటే తనకు ఇష్టమని, తన ఇంటి నిర్మాణానికి ఎల్ఐసీ ద్వారానే రుణం పొందినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వరంగాలు, చట్టాలను కాపాడుకొనడమంటే దేశ ఉనికిని కాపాడుకోవడమేనన్నారు. నేటి సమాజంలో సామూహిక పనులపై ప్రజల్లో అనాసక్తి ఉందని, వ్యక్తిగత ప్రయోజనాలు పెరిగాయని, ప్రజల్లో సామూహిక ప్రయోజనాలపై చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత క్రియాశీలక ప్రాత పోషిం చే పబ్లిక్ సెక్టార్లపై ఉందన్నారు. ఎల్ఐసీ బిల్డింగ్ కోసం ఎకరా భూమిని కేటాయించడానికి కృషి చేశానని, ప్రభు త్వం అధికారం కోల్పోవడం జరిగింద ని, అయినప్పటికీ తమకున్న పరిచయాలతో స్థలం కేటాయించేందుకు కృ షి చేస్తానన్నారు. జిల్లా కేంద్రంలో ఈ సమావేశం నిర్వహించినందుకు నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇం డియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా, కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర బాధ్యులు మద్దిలేటి, సుజాత, అనురాధ, రాజేశ్, బీసన్న, బద్రినాథ్ ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకుడికి పరామర్శ
మండలంలోని మున్ననూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నీలారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ. మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడిని శనివారం దవాఖానలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరామర్శించారు. నీలారెడ్డి తమకు, పార్టీకి ఆప్తులని, భగవంతుని దయవల్ల త్వరగా కోలుకొని ప్రజా సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతి యాదవ్, సర్పంచ్ శేఖ ర్ యాదవ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సాయిరాం తదితరులు ఉన్నారు.