మహబూబ్నగర్ : ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించిన అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయా ప్రాజెక్టుల ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు భూసేకరణ పనులను ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తూ గ్రావిటీ కెనాల్, ప్రధాన ఎడమ కాలువ తదితర భూసేకరణ పనులపై ఆరా తీశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పనులు వేగవంతం చేయాలని చెప్పారు.
ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇతర సంబంధిత ఇంజనీర్లు, అధికారులు, తాసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు.