కొల్లాపూర్ రూరల్, సెప్టెంబరు 14 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకంతో పాలమూరు పచ్చబడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్ను పరిశీలించారు. మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, బండ్ల కృష్ణామోహన్రెడ్డిలు పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును సందర్శించారు. మంత్రి నిరంజన్రెడ్డి కంట్రోల్ రూంను పరిశీలించి మొదటి లిఫ్ట్లో అన్ని పంప్లను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వట్టెం వరకు నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్జ్పూల్, పంప్హౌస్, డెలవరీ సిస్టర్న్ను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
ఈనెల 16వ తేదీన పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానుండడంతో ఉమ్మడి పాలమూరు సస్యశామలం అవుతోందన్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కొల్లాపూర్ నుంచి కృష్ణానది ద్వారా పాలమూరు జిల్లాకు సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని, పీఆర్ఎల్ఐతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి ఢోకా ఉండదన్నారు. బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, సీఈ అమీద్ ఖాన్, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెంటారెడ్డి సేవలు అమోఘం..
ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారుడు పెంటారెడ్డి సేవలు చాలా గొప్పవని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మంత్రి పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్ సందర్శనలో కంట్రోల్ రూంను పరిశీలించారు. అక్కడే పనిలో నిమగ్నమైన పెంటారెడ్డి వద్దకు మంత్రి వెళ్లి ముచ్చటించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెంటారెడ్డి చేస్తున్న సేవలు అపూర్వమైనవని చేతులు పట్టుకొని నమస్కారం చేస్తూ బావోద్వేగానికి గురయ్యారు.