నారాయణపేట, జనవరి 10 : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం 29 క్వింటాళ్ల తెల్ల కందులు విక్రయానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.10,009, కనిష్ఠంగా రూ. 8,809 ధర పలికాయి. అదేవిధంగా 432 క్వింటా ళ్ల ఎర్ర కందులు విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.9,851, కనిష్ఠంగా రూ.9,225 ధర పలికాయి. 31క్వింటాళ్ల సోనరకం ధాన్యం విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.3,009, కనిష్ఠంగా రూ.2,969 ధర పలికాయి. 10 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా, క్వింటాకు రూ.5,580 ధర పలికినట్లు మార్కెట్యార్డు సూపర్వైజర్ లక్ష్మణ్ తెలిపారు.
జడ్చర్ల, జనవరి 10 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులకు ధరలు ఆశాజనకంగా లభిస్తున్నాయి. కందులకు ధరలు పెరిగా యి. ఈ సారి వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నా యి. కంది విత్తనాలు వేసే సమయంలో వానలు పడి.. తర్వాత ఆశించిన స్థాయిలో కురవకపోవడం తో పైర్లు ఎదగలేదు. దీంతో కంది పూత, కాత రాకపోవడంతో దిగుబడులు తగ్గాయి. బోర్లు, కాల్వల కింద పంట సాగు చేసిన రైతులకు మాత్రం దిగుబడి బాగా వచ్చింది. అయితే దిగుబడి తగ్గడంతో మార్కెట్లో కందికి డిమాండ్ పెరగడంతో మంచి ధరలు పలుకుతున్నాయి. ఇంకా ధర పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపారులు, మార్కెట్ వర్గాలు అంటున్నాయి. బాదేపల్లి మార్కెట్కు బుధవారం కందులు విక్రయానికి వచ్చాయి.
మార్కెట్కు 78 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా క్వింటాకు రూ.9,160 ధర, కనిష్ఠంగా రూ.8,821, మధ్యస్తంగా రూ. 9,111 ధర పలికింది. వీటితోపాటు ధాన్యం, మొక్కజొన్న, వేరుశనగ, ఉలువలు, పత్తి కూడా అమ్మకానికి వచ్చింది. ఆర్ఎన్ఆర్ ధాన్యం 77 క్వింటాళ్లు రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.2,711 ధర, కనిష్ఠంగా రూ.2,569, మధ్యస్తంగా రూ. 2,711 పలికింది. మొక్కజొన్న 42 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.2,287ధర, కనిష్ఠంగా రూ. 2,287, మధ్యస్తంగా రూ.2,287 ధర వచ్చింది. హంస ధాన్యం 49 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ. 1,958 ధర లభ్యమైంది. వేరుశనగ 849 క్విం టాళ్లు రాగా గరిష్ఠంగా రూ.8,109ధర, జొన్నలు 2 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.1,851 ధర, ఉ లువలు 9 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.5,952 ధర, పత్తి 450 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా గ రిష్ఠంగా రూ.6,389 ధర వచ్చింది.