జడ్చర్ల, నవంబర్ 30: హంసధాన్యానికి రికార్డుస్థాయిలో ధర పలుకుతున్నది. మార్కెట్ చరిత్రలో లేనివిధంగా హం సకు క్వింటాకు అత్యధికంగా రూ.2,299 పలికింది. రూ. 1400 నుంచి రూ.1700వరకు పలికే హంసకు ఏకంగా రూ.2,299పలికింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతపెద్ద మొత్తంలో ధరలు రావడం ఇదే మొదటిసారి. ఈ ఘనత బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు దక్కింది. మొదట్లో ఊరించిన పత్తి ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం హంసధాన్యం క్వింటా రూ.2,299, పత్తికి క్వింటా రూ.8,679 ధర పలికింది. 629క్వింటాళ్ల హంసరకం ధాన్యం రాగా, క్వింటాళుకు గరిష్ఠంగా రూ.2,299, కనిష్ఠంగా రూ.2,087, మధ్యస్తంగా రూ.2,178 పలికింది. అదేవిధంగా 5,121క్వింటాళ్ల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.2,406, కనిష్ఠంగా రూ.1,605, మధ్యస్తంగా రూ.2,389 పలికింది. 1129క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.2,231, కనిష్ఠంగా రూ.2,087, మధ్యస్తంగా రూ.2,178 పలికింది. 15క్వింటాళ్ల సోన రకం ధాన్యం రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.1,922ధర పలికింది. అదేవిధంగా 2క్వింటాళ్ల పెబ్బర్లు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.13,064ధర పలికింది. అదేవిధంగా 474క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.8,679, కనిష్ఠంగా రూ.6,011, మధ్యస్తంగా రూ.8,659 పలికింది.
వేరుశనగ క్వింటా రూ.9,020
వనపర్తి, నవంబర్ 30: వనపర్తి మార్కెట్ యార్డుకు వేరుశనగ భారీగా తరలివస్తున్నది. బుధవారం మార్కెట్కు 204బస్తాలు రాగా, క్వింటాకు అత్యధికంగా రూ.9,020, అత్యల్పంగా రూ.6,816, మోడల్ నెంబర్ రూ.8,030 వచ్చినట్లు మార్కెట్యార్డు సెక్రటరీ లక్ష్మయ్య తెలిపారు.