తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరునామా ఆరుతడి పంటలు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు, ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు
చేయడం మేలు. మార్కెట్కు అనుగుణంగా సాగు చేయడంతో రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులకు కొద్ది వ్యవధిలోనే తక్కువ ఖర్చు, యాజమాన్యంతో అధిక దిగుబడులు, మద్దతు ధరలు సాధించే అవకాశం ఉన్నది.
నాగర్కర్నూల్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఆ రుతడి పంటలతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు, ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు చేయ డం మేలు. మార్కెట్కు అనుగుణంగా సాగు చేయడంతో రై తులు లాభాలు గడించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో ఆ రుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు అధికారులు అవగాహన కల్పించడంతో వేరుశన గ, ఆముదం, పెసర, మినుములు, శనగ, మొక్కజొన్న, ఆ వాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, ఉలవలు, జొన్న, ను వ్వులు వంటి పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పంటలు 100 నుంచి 150 రోజుల్లోనే చేతికి వచ్చే అవకా శం ఉన్నది. ఎరువులు, నీటి వినియోగం, చీడపీడల బెడద తక్కువ. ముఖ్యంగా ఈ పంటలతో నేల భూసారం పెరుగుతుంది. వీటిని అంతర, మిశ్రమ పంటలుగానూ సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ పంటలకు అధిక డిమాండ్ ఉన్న ది. నేల స్వభావాన్ని బట్టి ఈ పంటలను సాగు చేయాలి. వ రి అయితే 3 నుంచి 4 నెలల కాలం పడుతుంది.
ఈ పం టకు 1200 మిల్లీ లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ఇక సా గు యాజమాన్యం కూడా ఖర్చు, కష్టాలతో కూడుకున్నది. వరి పండించే నీటితో.. నాలుగైదు రకాల స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగుచేసుకోవచ్చు. అతి తక్కువ నీటితో నూ నె గింజలు, కూరగాయలు పండించడం ఉత్తమమని అధికారులు తెలిపారు. ఈ పంటలను మార్కెట్కు అనుగుణం గా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వరుసగా వరి వేయడం వల్ల భూసాంద్రత దెబ్బతింటుంది. భవిష్యత్తులో వరితోపాటు ఇతర పంటలూ దిగుబడి రాని పరిస్థితులు ఏర్పడుతాయి. అదే ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల దీర్ఘకాలంలో భూ సాంద్రతను పెంచుకోవచ్చు.
పంటల సాగు ఇలా..
వేరుశనగ : నీటి సౌకర్యం ఉన్న ఎర్ర నేలల్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 60 నుంచి 80 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 100 నుంచి 105 రోజుల్లో పంట కోతకు వ స్తుంది. రూ.12 వేల వరకు పెట్టుబడి పెడితే ఎకరాకు 10 నుంచి 14 క్వింటాళ్ల దిగబడి వస్తుంది. ప్రభుత్వం రూ.5,850 మద్దతు ధర కల్పించింది.
పెసర : నీటి సౌకర్యంతో ఎర్ర, నల్లరేగడి నేలల్లో, వరి మాగాణుల్లో ఇప్పుడు వేసుకోవచ్చు. లేదా ఫిబ్రవరి-మార్చి వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 6 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఎకరాకు కేవలం రూ.10 వేల పెట్టుబడి అవుతుంది. 60 నుంచి 70 రోజుల్లోనే చేతికి వస్తుంది. 5 నుం చి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం క్వింటాకు రూ.7,755 చొప్పున మద్దతు ధర కల్పించింది.
మొక్కజొన్న : ఎర్రరేగడి, నల్లరేగడి నేలల్లో పండుతుంది. హైబ్రీడ్, ప్రైవేట్ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తనాలను నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ప్రభుత్వం క్వింటాకు రూ.1,962 మద్దతు ధర కల్పిస్తున్నది. జొన్న పంటను డిసెంబర్ వరకూ విత్తుకోవచ్చు. నల్ల, ఎర్ర, ఇసుక, దుబ్బ నేలల్లోనూ ఈ పంటను సాగు చేయవచ్చు. ప్రభుత్వం రూ.2,970మద్దతు ధర కల్పించింది.
కంది : నల్లరేగడి, ఎర్ర చెల్క నేలలు అనుకూలం. ఈ పంట 120-130 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.15వేల పెట్టుబడి పెడితే 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ.6,600 మద్దతు ధర ప్రకటించింది.
పొద్దుతిరుగుడు : ఎర్ర, నల్లరేగడి నేలల్లో మంచి దిగుబడి వస్తుంది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 30 కిలోల విత్తనాలు కావాలి. ఈ పంట కేవలం 95 రోజుల్లోనే చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి పెడితే 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం రూ.6,400 మద్దతు ధర కల్పించింది. యాసంగి, వేసవి సీజన్లలో కొద్దిపాటి నీళ్లతోనే ఈ పంట పండుతుంది.
నువ్వులు : జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ పంట సాగుకు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరాకు 2 నుంచి 2.25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 90 రోజుల్లోనే కోతకు వస్తుంది. యాసంగిలో అధిక దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.7,830 ధర ఉన్నది.
మినుములు : నవంబర్ నెలాఖరు వరకు మినుముల విత్తనాలు విత్తుకోవచ్చు. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం ఉన్నది. ప్రభుత్వం రూ.6,600 మద్దతు ధరను నిర్ణయించింది.
ఆవాలు : నల్లరేగడి నేలల్లో ఈ పంట పండుతుంది. పూస అగ్రాని, పూస మహాక్, వరుణ, నరేంద్ర, అగేతితోపాటు ఇతర ప్రైవేట్ కంపెనీలకు చెందిన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయి. నవంబర్ రెండో వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరాకు 2 నుంచి 2.50 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 120-125 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో రూ.5,050 మద్దతు ధర ఉన్నది.
కుసుమలు : శీతాకాలంలో అనువైన ఈ పంట ఎకరాకు 4 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట 125-130 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. 4నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రభుత్వం క్వింటాకు రూ.5,441 మద్దతు ధర కల్పించింది.
శనగ : వర్షాధార నల్ల రేగడి, తేమ పట్టి ఉంచే నేలల్లో ఈ పంట సాగు చే యొచ్చు. ఈ పంట 90-110 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాకు రూ.10వేల పెట్టుబడులు అవసరమవుతాయి. 8-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
పప్పు పంటలకు డిమాండ్..
మార్కెట్లో డి మాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. వ రి సాగుచేసే నీటితో నా లుగైదు రకాల ఆరుతడి పంటలు సాగు చేయొ చ్చు. ఎప్పుడూ ఒకే పంట వేస్తే భూసారం దెబ్బతింటుంది. దీనికి పంట మార్పిడే ముఖ్యం. చౌడ నే లలు మినహా మిగిలిన భూముల్లో వాణిజ్య పంటల సాగుతో ప్రయోజనం కలుగుతుంది. పెట్టుబడులు త గ్గుతాయి. మద్దతు ధర కూడా అధికంగానే ఉంటుంది.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్కర్నూల్