మక్తల్ టౌన్/ఊట్కూరు, ఫిబ్రవరి 2 : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో గాలి మేడలు చూపించి, అమ లు కానీ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రవి కన్వెన్షన్ హాల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లు కేసీఆర్ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించి ఆగమైన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశాల్లో తెలంగాణ పరువు తీశారన్నారు. బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక దావోస్లో 100 అడుగుల లోతులోకి తొకుతానంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. త్వరలోనే రేవంత్రెడ్డిని బొంద పెట్టేందుకు తమ పార్టీకి చెందిన నాయకులు సిద్ధమవుతున్నారన్నా రు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 17ఎంపీ స్థానాలు గెలిస్తేనే హామీలు అమలకు ఆసారం ఉందంటూ రేవంత్రెడ్డి మాట్లాడడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే అన్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే హామీల అమలు చేస్తామని ప్రజలకు చెప్పి హామీలను ప్రకటించారా అని ప్రశ్నించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ దేనిని పేరొన్నారు. దొంగల ముఠా లాగ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసి 420 హామీలను ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చారన్నారు.
అమలుకాని హామీలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి చెప్పిన మాట ఎకడ పోయిందని డిసెంబర్ 9 పోయి ఫిబ్రవరి 9 వస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇవ్వడంతోపాటు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యాసంగిలో కేసీఆర్ రైతన్నలకు రైతుబంధు వేయడానికి రూ.7,000 కోట్లను ట్రెజరీలో పెడితే ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ కాకుండా అడ్డుకున్నది రేవంత్రెడ్డి అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతన్నలకు రైతుబంధు జమ చేయకుండా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.5000 కోట్లను వాడుకొని రూ.రెండు వేల కోట్లు మాత్రమే రోజు గుంట చొప్పున రైతన్నలకు రైతుబంధు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హామీల్లో ప్రతి మహిళాకు మహాలక్ష్మి పథకం నుంచి నెలకు రూ.2500 ఇస్తామన్నారని, రాష్ట్రంలో కోటీ 28 లక్షల మంది మహిళలు ఉన్నారని వారికి ఒక్కొక్కరికీ రూ.2500 చెల్లిస్తే ఎన్నికోట్లు అవుతుందో, వాటిని ఎక్కడ నుంచి తీసుకువస్తారో సీఎం రేవంత్రెడ్డి లెక్కలు చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు మభ్యపెట్టేందుకే రేవంత్రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి వారి మెడలు వంచుదామని సత్యవతి రాథోడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేది ఎవరనే విషయాన్ని అధినేత కేసీఆర్తో చర్చించి ప్రకటించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.
కార్యకర్తలు, నాయకుల సమన్వయ లోపం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కార్యకర్తలను పట్టించుకోకుండా వారి క్షేమాలను అడగకపోవడంతో కార్యకర్తలు, నాయకులకు సమన్వయం కొరవడిందన్నారు. మితిమీరిన పథకాలతో సంక్షేమంలో ముందుకు దూసుకెళ్దామని అనుకున్న తరుణంలో లబ్ధిదారులకు సరైన న్యాయం జరుగక బాధపడుతున్న వారిని పట్టించుకోకపోవడంతో వారి బాధలు చెప్పుకోలేక నాయకులు సైతం వారిని అడగకపోవడంతోనే పెద్దనష్టం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఓటరు లిస్టులు పట్టుకొని బీఆర్ఎస్ వాళ్లు తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు సంక్షేమ పథకాలు పొందిన వారి లిస్టు పట్టుకొని పొందని వారికి చాడీలు చెప్పడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి మరో కారణం అన్నారు. జరిగిన దాన్ని వెనకి తీసుకురాలేం కాబట్టి త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త నాయకుడికి అందుబాటులో ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తప్పకుండా వరిస్తుందన్నారు. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు, నేతలు బాధల నుంచి తేరుకొని ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని, కార్యకర్తలకు ఎలాంటి హాని కలుగకుండా వారిని కంటికి రెప్పలా చూసుకునేందుకు ప్రతి ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్గౌడ్ భరోసా ఇచ్చారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మక్తల్ను అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దినప్పటికీ గ్రామ స్థాయిలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఓ వర్గానికి చెందిన కొద్దిపాటి ఓట్లతో ఎన్నికల్లో తాను ఓడిపోవాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఓటమికి కార్యకర్తల ఓవర్ కాన్ఫిడెన్స్ మరో కారణంగా పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమేనని, అంతమాత్రాన కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు. ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిలా భావించి కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులని, ప్రజల ఆశీస్సులు తమ కుటుంబంపై మెండుగా ఉండటంతో 12 పర్యాయాలు పోటీ చేసి 8సార్లు గెలుపొందామని చెప్పారు. జరిగిన పొరపాట్లను సమీక్షించుకొని వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు కంకణ బద్ధులు కావాలన్నారు. మన పెద్ద నాయకుడు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడని, కాంగ్రెస్ అరాచకాలను కడిగి పారేస్తాడన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణతో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేద్దామని కార్యకర్తలను ఉత్తేజం చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపించుకుందామని పిలుపునిచ్చారు.
రైతు బంధు, రైతు బీమా, ధరణి పోర్టల్ వంటి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో పార్టీ ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందించడంతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటును కేసీఆర్ ప్రభుత్వం అందించిందన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తల ప్రమేయం లేకుండా పథకాలను ప్రజలకు అందించడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలువలేక పోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, రైల్వేలైన్ల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాముడు గుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని, యాదాద్రిని కేసీఆర్ అద్భుతంగా కట్టించినా ఓట్ల కోసం అడగలేదన్నారు. సమావేశం అనంతరం మొత్తం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెంది న మాజీ సర్పంచులకు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పూలమాల, శాలువాతో ఘనంగా సతరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, దేవరి మల్లప్ప, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, రజినీసాయిచంద్తోపా టు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ మం డలా ల అధ్యక్షులు, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచులు, పీఏసీసీఎస్ అధ్యక్షులు, డైరెక్టర్లు, గ్రామ పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.