జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
నారాయణపేటటౌన్, మే 16: పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. డెంగీ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాంమనోహర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో శైలజ, మాస్ మీడియా అధికారి హన్మంతు, డాక్టర్ లఖావత్, డాక్టర్ రాఘవేందర్, గోవిందరాజు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఊట్కూర్, మే 16 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చన్నారు. దోమ కాటువల్ల డెంగీ సంభవిస్తోందని, సాధారణంగా వానకాలంతోపాటు చలికాలంలో ప్రజలు వ్యాధిబారిన పడే అవకాశం ఉందన్నారు. దోమల నియంత్రణతో డెంగీని అరికట్టవచ్చన్నారు. డెంగీ నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం పరిసరాల శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్రెడ్డి, సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎంలు శైలజ, కవిత, పంచాయతీ సిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటకొండ పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ
నారాయణపేట రూరల్, మే 16: జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా కోటకొండ పీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ వెంకటదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి డెంగీ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ డెంగీ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వానకాలంలో పరిసరాల శుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీహెఈవో సునంద, పీహెచ్ఎన్ నాగరాజు, ప్రభావతమ్మ, కామాక్షి, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.