మహబూబ్నగర్, డిసెంబర్ 8 : పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్లో పాసైన అభ్యర్థులకు గురువారం ఉదయం 5 గంటల నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 600 మంది పురుషులకుగానూ 461 మంది హాజరుకాగా.., ఫైనల్ పరీక్షకు 256 మంది అర్హత సాధించారు. రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పద్ధతి ద్వారా పోటీ పరీక్షల్లో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు.
అనంతరం 1600 మీటర్ల పరుగు పందెం, ఎత్తు, బరువు, లాంగ్జంప్, షాట్పుట్ వంటి ఈవెంట్స్ను నిర్వహించారు. ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఎస్పీలు వెంకటేశ్వర్లు, డాక్టర్ చేతన పర్యవేక్షణలో దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రాములు, డీఎస్పీలు, ఎస్సైలు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.