చంద్రయాన్ -3 సక్సెస్పై ప్రజలు సంబురాలు చేసుకున్నారు. వినువీధుల్లో బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు ఆవిష్కృతమైన ఘట్టాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆయా పాఠశాలల విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఊపిరి బిగపట్టుకొని టీవీలు.. సెల్ఫోన్లలో తిలకించారు. చందమామపై కాలుమోపి కొత్త చరిత్రను ఆవిష్కరించిన భారత ఇస్రో శాస్త్రవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ప్రజలు జేజేలు పలికారు. గగనతలంలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారతావని పండుగ జరుపుకొన్నది. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగితేలారు. మరోమారు ఇస్రో చరిత్ర సృష్టించిందంటూ.. మేరా భారత్ మహాన్ అంటూ కేరింతలు కొట్టారు. యువకులు రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జయహో భారత్ అంటూ నినదించారు.
– నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), ఆగస్టు 23
పాలమూరు, ఆగస్టు 23 : చంద్రయాన్ -3 సక్సెస్ దేశం గర్వించదగ్గ రోజుగా నిలిపోతుంది. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో శాస్త్ర వేత్తలకు శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా స్థానిక పాలమూ రు విశ్వవిద్యాలయంలో, జేపీఎన్సీ కళాశాలలో, వాగ్దేవి జూనియర్ కళాశాలలో కేక్కట్ చేసి ఘనంగా విద్యార్థుల తో కలిసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి, పీయూలో వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, రిజిస్టార్ గిరిజామంగతాయారు విద్యార్థులతో కలిసి చంద్రుడిపై ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియాను దీనంగా వీక్షించారు.
మరికల్, ఆగస్టు 23 : జాబిలిపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగడంతో జయహో భారత్ అంటూ మరికల్లో యువకులు, విద్యార్థులు సంబురాలు జరుపుకొన్నారు. మరికల్ మండల కేంద్రంలో ప్రతిభస్కూల్ విద్యార్థులు ఆల్ ది బెస్ట్ చంద్రయాన్-3 ఆకారంలో కుర్చొని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థాని క చౌరస్తాలో యువకులు పెద్ద స్క్రీన్ను ఏర్పాటు చేసి చంద్రయాన్-3 ల్యాండింగ్ను ప్రత్యేక్షంగా వీక్షించారు. అనంతరం చౌరస్తాలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సం బురాలు నిర్వహించారు. కార్యాక్రమం లో బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు రాజీవ్, యువకులు రాజు, సురేశ్, శేఖర్, నాగరాజు, రఘు, మల్లేశ్, పెంటమీది నారాయణ, రవికిరణ్, కూసూరు రవి, మోహన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఆగస్టు 23: భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావాలని ఆంకాంక్షిస్తూ బుధవారం స్థానిక సర్వసతీ శిశుమందిర్, పెద్దజట్రం జెడ్పీఉన్నత పాఠశాల, నిడుగుర్తి యూపీఎస్ విద్యార్థులు చంద్రయాన్ ఆకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.