పాలమూరు, ఫిబ్రవరి 1 : పీయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పిండి పవన్కుమార్ను నియమిస్తూ పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన పవన్కుమార్ను వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, అధికారు లు కలిసి శుభాకాంక్షలు తెలిపా రు.
ఈ సందర్భంగా పవన్కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. రిజిస్ట్రార్ను కలిసిన వారిలో పీఆర్వో రవికుమార్, ప్రొఫెసర్లు జంగం విశ్వనాథ్, అర్జున్కుమార్, భూమయ్య, శ్రీధర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, బషీర్అహ్మద్, కరుణాకర్రెడ్డి, గాలెన్న, ఈశ్వర్, రవికాంత్, నాగసుధ, జయనాయకి, విజయలక్ష్మి ఉన్నారు.