మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎం పీ మన్నె.. చండీఘడ్, లేహ్, షిమ్లా స్టడీ టూర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్పోర్ట్ జారీ వి షయంలో అవకతవకలు జరగకుండా ఎలాంటి ప్రమాణాలు పాటించాలనే అంశంపై రీజినల్ పా స్పోర్ట్ అధికారులు, ఉన్నతస్థాయి అధికారులతో కలిసి అధ్యయనం చేసినట్లు తెలిపారు.
దరఖాస్తుదారుల వివరాలను పాస్పోర్ట్ శాఖ, పోలీసు అధికారులు అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయడంతోపాటు విచారణ జరపాలని సూచించారు. పాస్పోర్ట్, పోలీసు శాఖలతోపాటు పాస్పోర్టును బట్వాడా చేసే తపాలా శాఖ దరఖాస్తుదారుడికి సాధ్యమైనంత త్వరగా పాస్పోర్టును అందించేలా చూడాలన్నారు. ఈ పర్యటనలో భాగంగా హిమాచల్ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో ఎంపీ మన్నె భేటీ అయ్యారు.