పర్యాటకంగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం
కోయిల్సాగర్లో బోటింగ్ ఏర్పాటుతో పెరగనున్న సందర్శకుల తాకిడి
పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
దేవరకద్ర రూరల్, మార్చి 17 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాలమూరు జిల్లాను ప ర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గు రువారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజె క్టు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర కృతి సిద్ధంగా కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కోయిల్సాగర్ రిజర్వాయిర్ ఉన్నదన్నారు. ఇక్కడికి పర్యాటకులు వచ్చి వెళ్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తే మరిం త మంది వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందు లో భాగంగా బోటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అవకాశం ఉన్నచోట్ల టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కోయిల్సాగర్లో బోటింగ్తో పాటు హోటల్, రెస్టారెంట్, కాటేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే తపన పడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి కోయిల్సాగర్ను పర్యాటకంగా మరింతగా అభివృద్ది చేస్తామన్నారు. అ నంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కోయిల్సాగర్లో బోటింగ్ సౌకర్యంతో చుట్టుపక్కల 3, 4 నియోజకవర్గాల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. సాగర్లో పెద్ద బోటుతోపాటు స్పీడ్ బోటును ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎండీ మనోహ ర్, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, అధికారులు వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుగుణ, పీఏసీసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, చల్మారెడ్డి, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.