మహబూబ్నగర్, డిసెంబర్ 5( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వర లో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. విదేశాలతో పోలిస్తే మన వద్ద సూ పర్ స్పెషాలిటీ వైద్యం తక్కువ ఖర్చులతో చేయించుకునే అవకాశం ఉందన్నారు.
సోమవారం పాత కలెక్టరేట్లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని కోర్టు క్లాంపెక్స్లో సరైన వసతులు లేనందున కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బం ది ఇబ్బందులు తప్పడం లేదని, అందుకే పట్టణంలో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లగా ఆయన అంగీకరించారని తెలిపారు. పాలమూరు యూనివర్సిటీకి పక్కన నూతనంగా ఏర్పాటు కానున్న బైపాస్ రోడ్డు సమీపంలో పదెకకరాల స్థలంలో అధునాతన కోర్టు భవనాన్ని నిర్మించనున్నట్లు వివరించారు.
అలాగే మహబూబ్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్కు మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులను ఆయన అభినందించా రు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరైనందున ప్రజలందరికీ మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖానకు వారం, పది రోజుల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు భూమిపూజ చేస్తారని మంత్రి తెలిపారు.
మహబూబ్నగర్లో 10వేల మందికి ప్రత్యక్షంగా, వేలాదిమందికి పరోక్షంగా ఉపాధి అందించే అమరరాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని, దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరిస్తాయన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నందున భవిష్యత్తులో పెద్దఎత్తున ఈ ప్రాం తానికి ఐటీతోపాటు ఇతర పరిశ్రమలు భారీగా తరలివస్తాయన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ పాల్గొన్నారు.