పంట పెట్టుబడికి అప్పులపాలు కావొద్దన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న రైతుబంధుకు కర్షకులు జేజేలు పలుకుతున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం బుధవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. తొలిరోజు ఎకరంలోపు వారికి అందజేయగా.. రెండో రోజు ఉమ్మడి జిల్లాలోని రెండెకరాల్లోపు 1,49,974 మంది రైతుల ఖాతాల్లో రూ.166 కోట్లను జమ చేసింది. మొబైల్ ఫోన్లకు టింగ్.. టింగ్.. మంటూ ‘రైతు’ ఇంటికి ‘బంధు’వు వచ్చినట్లు మెసేజ్లు రావడంతో కర్షకులు సంబురాల్లో మునిగిపోయారు. పెట్టుబడికి కష్టాలు తీరడంతో సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలని దీవిస్తున్నారు. రెట్టింపు ఉత్సాహంతో యాసంగి పంటల సాగులో నిమగ్నమయ్యారు.
– నారాయణపేట, డిసెంబర్ 29
మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఎర్రవల్లి తండా శివారులో పొలంలో రైతుబంధు డబ్బులను చూసి సంతోష పడుతున్న రైతు రెడ్యానాయక్, భార్య బుజ్జి
నారాయణపేట, డిసెంబర్ 29 : సీఎం కేసీఆర్ దూ రదృష్టితో తీసుకొచ్చిన రైతుబంధు పథకంతో నాడు వ్యవసాయం దండగ అన్న స్థాయి నుంచి నేడు పం డుగ అనే స్థాయికి చేరుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటడం, బోర్లు పడకపోవడం, కనీసం ఆరు గంటల కరెంట్ కూడా ఉండకపోవడానికితోడు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేయడంతో చాలా మంది రైతులు అప్పుల పాలై రైతు కూలీలుగా మారారు. మరి కొంతమంది పొలాలను అమ్ముకొని ముంబా యి, పూణె, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు.
మిగిలిన వారు భూములను బీళ్లుగా పెట్టి వేరే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. కానీ, 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించడంతో సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. ఆ నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ అందించడంతోపాటు పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్నారు. ఎకరంలోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు. రైతు ఏ విధంగా మరణించినా రూ.5 లక్షల రైతుబీమా అందిస్తున్నాడు. పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయడం తో రైతులు రాజుగా బతుకుతున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా భూగర్భజలాలు పెరిగాయి. బోర్లు ఎక్కడ డ్రిల్ చేసినా గంగమ్మతల్లి పైకి వస్తుండడంతో వలస వెళ్లిన రైతులు తి రిగి స్వగ్రామాలకు చేరుకొని సాగు చేపడుతున్నారు. రైతులకు పె ట్టుబడి సాయం అందించి తోడ్పాటుగా నిలుస్తున్నది. డబ్బులు తమ అకౌంట్లో పడగానే రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లాలో 1.73 లక్షల మంది రైతులకు 4.62 లక్షల ఎకరాలు ఉన్నది. రైతుబంధు కింద రూ.230.23 కోట్లు వారి అకౌంట్లలో జమచేయనున్నారు. అయితే, మొదటి రోజు 39,884 మంది రైతులకు రూ.12,44,60,175 ఖాతాల్లో జమయ్యాయి. రెండోరోజు 71,065 మంది రైతులకు రూ.69,57,92,136 పంట పెట్టుబడి సాయంగా అందింది.
దేశమంతా అమలుకావాలి..
పది విడుతలు గా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయి. ఇది చాలా మం చి పథకం. ఇది ఇ లాగే కొనసాగాలి. రైతుల కోసం సీఎం కేసీఆర్ సారు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. దేశంలో బీఆర్ఎస్ స్థా పించి అంతటా పథకాలు అమలుకావాలని కోరుతున్నా.
– రాంరెడ్డి, రైతు, బుక్కాపురం, అలంపూర్ మండలం
సాగుపై భరోసా పెరిగింది..
పెట్టుబడి నుంచి పంట కొనేదాక సీఎం కేసీఆర్ సారు చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోం. ఒకప్పుడు విత్తనాల కోసం లైన్లు.. ఎరువుల కోసం పోలీస్స్టేషన్ల వెంట పరుగులు.. కరెంట్ కోసం ధర్నాలు.. పంటలను కొనకపోతే రాస్తారోకోలు.. అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వ్యవసాయంపై భరోసా కలిగింది. వలస బాట పట్టిన ఎంతో మంది రైతులు స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు.
– రాందాస్నాయక్, మేకహన్మాన్తండా, నారాయణపేట మండలం
రెండో రోజు రైతుబంధు వివరాలు
వనపర్తి రైతులు : 24,234
అందిన సాయం రూ.6.50 కోట్లు
నారాయణపేట రైతులు : 71,065
అందిన సాయం రూ.69.57 కోట్లు
జోగుళాంబ గద్వాల
రైతులు : 36,434
అందిన సాయం రూ.12.04 కోట్లు
నాగర్కర్నూల్ రైతులు : 51,021
అందిన సాయం రూ.64.50 కోట్లు