తెలకపల్లి, మార్చి 24: మండలంలోని పెద్దపల్లి గ్రామ సమీపం లో ఉన్న బుగ్గస్వామి గుట్టపై క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన శివలింగాన్ని పురావస్తు పరిశోధన శాఖ, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి ఆదివారం పరిశీలించారు. కవి వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్ ఇచ్చి న సమాచారం మేరకు పురావస్తు శాఖవారు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివలింగం కూటుల కాలం నాటిదని తెలిపారు. శివలింగానికి సంబంధించిన పానపట్టాన్ని పరిశీలించిన తర్వాత ఇది క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినదిగా పేర్కొన్నారు. ఆయన వెంట అర్చకుడు వంశీకృష్ణతోపాటు గ్రామస్తులు ఉన్నారు.