కొత్తకోట, ఏప్రిల్ 15 : ఆరు గ్యారెంటీలను న మ్మి కాంగ్రెస్కు ఓటేసి చిమ్మచీకటి చేసుకున్నారని, ఇంకోసారి అలాంటి తప్పు చేయొద్దని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. సోమవారం కొ త్తకోటలోని బీపీఆర్ గార్డెన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఉ మ్మడి రాష్ట్రంలో చిమ్మచీకట్లో ఉన్న విద్యుత్ను దశ ల వారీగా 24గంటల విద్యుత్, సాగు నీరు అందించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక కొత్త ప్రాజెక్టు, రైల్వే లైన్, ఎన్ఐటీ కాలేజీలు లేవన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఒక్క గ్యా రెంటీతోనే భార్యకు భర్తకు మధ్య గొడవలు సృష్టించారన్నారు.
అంబేద్కర్కు కాంగ్రెస్సేతర ప్రభుత్వ మే భారతరత్న ఇచ్చిందని, అంబేద్కర్ రెండు సా ర్లు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీయే ఓడించిందని గుర్తు చేశారు. బీజేపీ మత చిచ్చులను రెచ్చగొట్టిందని, బ డా నాయకులకు బ్యాంకులను కొల్లగొట్టి ధనికుల ను చేసిందని అలాంటి పార్టీని నమ్మొద్దన్నారు. మూడు నల్ల చట్టాలతో 1100 మంది రైతులను హ త్య చేసింది మోదీ ప్రభుత్వమే అని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కసితో పని చేయాలని, పాత నీరు పోయిన కొత్త నీరుతో ఉత్సాహంగా పని చే యాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ మౌని క, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, నాయకులు జయ మ్మ, పద్మ, సంధ్య, నాగన్నసాగర్, ప్రశాంత్, అ య్యన్న, కొండారెడ్డి, ఖాజామైనుద్దీన్, తిరుపత య్య, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.