నాగర్కర్నూల్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఎన్నో అనుభూతులను మిగిల్చిన 2023వ సంవత్సరం ఆదివారంతో ముగిసింది. ఏడాది పొడవునా ఈ సంవత్సరం పలువురి జీవితాల్లో మధుర స్మృతులను, చేదు అనుభవాలను నింపింది. కొత్త సంవత్సర వేడుకల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే..1752లో ఇంగ్లండ్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం చాలా దేశాలు అనుసరించే గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీని ప్రకారం డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు నూతన సంవత్సర సంబురాలు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ముందు రోజు రాత్రి నుంచి పార్టీలతో యువకులు ఆనందంలో మునిగిపోయేందుకు సిద్ధమయ్యారు. చాలా మంది ఇప్పటికే టూర్లకు బయలుదేరారు. ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు చేసుకోనున్నారు. ఇక బేకరీలు, స్వీట్హౌస్ల్లో కేక్ల అమ్మకాల కోసం ప్రత్యేకంగా టెంట్లు వేసి విక్రయించా రు. ముఖ్యంగా మద్యం, చికెన్, మటన్ షాపుల్లో న్యూ ఇయర్ కిక్ నింపనున్నది. కాగా మేధావులు, రచయితలు, ఇతర ఉద్యోగులు కొత్త సంవత్సరంలో చేపట్టబోయే ప్రణాళికలను అమలు చేయనున్నారు.
న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ఆనవాయితీగా మారుతూ వస్తోంది. రెండు దశాబ్దాల కిందటి వరకు పోస్టు కార్డుల్లో, గ్రీటింగ్ కార్డుల్లో తమ సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర సీనరీల ఫొటోలు పంపుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగేది. ఆ తర్వాత టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలతో చెప్పుకోగా, ఇప్పుడు ఆ స్థానాన్ని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్లాంటి సామాజిక మాధ్యమాలు ఆక్రమించాయి. వివిధ పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలతోపాటు డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఫొటోలతో విషెస్ చెప్పుకోనున్నారు. దీంతో ఆయా మాధ్యమాలతో వచ్చే మెసేజ్లతో ఇన్బాక్స్ నిండి ఫోన్ స్టోరేజీని ఆక్రమిస్తోంది. మహిళలు కుటుంబంతో కలిసి జనవరి 1వ తేదీన ఆలయాలకు వెళ్లనున్నారు. అలాగే తెల్లవారుజామున ఇండ్ల లోగిళ్లలో రంగురంగుల ముగ్గులతో న్యూ ఇయర్ విషెస్ చెప్పనున్నారు. రాజకీయ నాయకులు ఈ ఏడాది ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రాబోయే కాలంలో తమ అడుగులు వేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోనున్నారు. మొత్తమ్మీద న్యూ ఇయర్తో ప్రజల్లో సందడి నెలకొన్నది.
వనపర్తి టౌన్/ఆత్మకూరు, డిసెంబర్ 31 : కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం రాత్రి చికెన్, మటన్ సెంటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొం ది. యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి కాల్చిన మాం సం, ఫ్రై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మాంసం ప్రియుల అభిరుచికి అనుగుణంగా దుకాణదారులు వెరైటీలతో అమ్మకాలు చేశారు. ఒక్కసారిగా జనం ఎగబడడంతో ధరలను అమాంతంగా పెంచేశారు. చికెన్ కిలో ఫ్రై రూ.500ల వరకు విక్రయించా రు. అలాగే జొన్నరొట్టెలు, చపాతీలు, మిక్చర్, కూల్ డ్రింక్ షాపులు గిరాకీతో కిటకిటలాడాయి.